బడంగ్పేట : భవిష్యత్లో ముంపు సమస్య రాకుండా ఉండటానికి ట్రంక్లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీలో కోటి రూపాయలతో ట్రంక్ లైన్ పనులకు మంత్రి శుక్రవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నందీహిల్స్ కాలనీ నుంచి వరద నీరు పోవడానికి రూ.14 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను అందరం చూశామన్నారు. ప్రజలకు ఉన్న ఇబ్బందిని గుర్తించి ట్రంక్లైన్ పనులను వర్షాకాలం రాక ముందే పూర్తి చేయించాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని చెరువులను సుందరీకరణ చేయిస్తున్నామన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో సుందరీకరణ చేసిన చందన చెరువును మెదక్ జిల్లా నుంచి వచ్చి చూసి పోవడం గర్వంగా ఉందన్నారు. అన్ని చెరువులను దశల వారీగా పూర్తి చేయిస్తామన్నారు. చెరువులలో మురుగునీరు పోకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నారు. చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. చెరువుల దగ్గర యోగా కేంద్రాలను, చిల్డ్న్ పార్కులను, సెటిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచనలు చేశామన్నారు.
ఇంటి గ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మార్కెట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రజల సౌలభ్యం కోసం ఇంటి గ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్ రావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, మేకల విజయ రవీందర్రెడ్డి, బొక్క రాజేందర్రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, కార్పొరేటర్స్ ముద్ద పవన్ కుమార్, వేముల నర్సింహ, గజ్జల రాంచందర్, రవి నాయక్, పద్మ, సిద్దాల బీరప్ప, ఏనుగుల అనిల్ కుమార్, కో ఆప్షన్ పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు.