ఏఐకేఎంఎస్ నాయకుల డిమాండ్
కేంద్రం ప్రభుత్వ తీరుపై నిరసన
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 10: పెంచిన ఎరువల ధరను వెంటనే తగ్గించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు పెంచిన జీవోను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశ్రాంతి భవనం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ముడిసరుకుల ధరలు పెరిగాయని సాకులు చెబుతూ 58 శాతం ఎరువుల ధరను పెంచుతూ జీవోను విడుదల చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ధరలు పెంచితే రైతులు మోయలేని ఆర్థిక భారం పెరుగుతుందని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, నాయకులు జక్కుల రాజన్న, వర్మ, మున్వార్, శంకర్, లక్ష్మణ్, ఎర్రన్న, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బార్లో ఆమ్లెట్ దొంగతనం.. ఒకరి దారుణహత్య
ఆర్మీ అధికారిగా ఫోజులు : పెండ్లి పేరుతో నయవంచన!