అర్వపల్లి, జూన్ 12 : మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని సీహెచ్ఓ చరణ్నాయక్ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం కొవిడ్ పేషెంట్ల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్పై అవగాహన కల్పించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరంతరం మాస్కు ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రమణ, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి
గ్రామాల్లో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. మండలంలోని గానుగుబండ గ్రామంలో శనివారం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా టీకాలు వేస్తున్నదన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నాగూనాయక్, ఆరోగ్య సిబ్బంది గోవిందరెడ్డి, సూరి, సోమయ్య, నాగరాజు, అంగన్వాడీ టీచర్లు శోభ, రమ పాల్గొన్నారు.