ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

హైదరాబాద్ : ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీరాజ్ ఉద్యోగుల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల రాష్ట్ర సంఘం డైరీ, క్యాలెండర్లను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఎంపీడీవోలు సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారని అభినందించారు.
ప్రజలను ప్రభుత్వ పథకాలలో భాగస్వాములను చేస్తూ ఆయా పథకాలు విజయవంతం చేయడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు ప్రతిభను కనబరుస్తున్నారని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంలో లో ఎంపీడీవోల పాత్ర ఎంతో ఉందన్నారు. పదోన్నతుల విషయంలో ఎంపీడీవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎంపీడీవోలు పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత కీలకంగా పని చేస్తున్నారని వారిని అభినందించారు. ఎంపీడీవోల పదోన్నతుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సానుకూలంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో టీజీవోల సంఘం అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సహదేవ్, డిప్యూటీ సీఈఓల సంఘం అధ్యక్షుడు బి. రాఘవేందర్ రావు, తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు సత్తయ్య, ప్రశాంతి, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ప్రచార కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ నాయక్, శ్రీనివాస్, భాస్కర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఢిల్లీలో జూలో బర్డ్ ఫ్లూ.. గుడ్లగూబలో వైరస్ లక్షణాలు
- తగ్గిన ఆదాయం: పెరిగిన రుణ స్కామ్లు
- అలా ఔటైనందుకు బాధ లేదు: రోహిత్ శర్మ
- సీఎం సహాయనిధి పేదలకు వరం : మంత్రి హరీశ్ రావు
- కరోనా టీకాలకు.. డప్పులు, పూజలతో స్వాగతం
- ఏంజెలా మెర్కెల్ వారసుడిగా అర్మిన్ లాస్చెట్
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
- కోవిషీల్డ్ టీకానే వేయించుకుంటాం: ఢిల్లీ వైద్యులు
- నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు