చౌటుప్పల్ రూరల్,మే14: మండలపరిధిలోని దండుమల్కాపురం గ్రామ వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని శుక్రవారం పిచికారీ చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ సైదిరెడ్డి, ఉపసర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ పాల్గొన్నారు.
చీకటిమామిడిలో…
బొమ్మలరామారం,మే14: గ్రామాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని చీకటిమామిడిలో సర్పంచ్ మచ్చ వసంత ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు లాక్డౌన్ నిబంధలు పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీశోభ, మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ గౌడ్, గొడుగు చంద్రమౌళి, బొర్ర నర్సింహ , వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రాజాపేటలో 15 మందికి కరోనా
రాజాపేట, మే 14: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు.
వలిగొండ మండలంలో 29 మందికి..
వలిగొండ, మే 14: మండల వ్యాప్తంగా 29 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ స్వామి తెలిపారు. శుక్రవారం మండలంలోని వర్కట్పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో 113 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.
గుండాలలో 9మందికి కొవిడ్ పాజిటివ్
మోత్కూరు(గుండాల), మే 14: గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 38మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ సోకిన వారికి ప్రభుత్వం జారీ చేసిన మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
అడ్డగూడూరులో 19 మందికి పాజిటివ్
అడ్డగూడూరు,మే14 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 45 మందికి కరోనా పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు ల్యాబ్ టెక్నీషియన్ బాలెంల అరవింద్ తెలిపారు.