జగిత్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జమ్మి మొక్కను నాటారు.
రాబోయే రోజుల్లో స్వంత ఖర్చులతో విశ్వక్సేన ఆలయం నిర్మించేందుకు తన వంతు సహకారం అందజేస్తానన్నారు. అనంతరం మల్యాల, కొడిమ్యాల మండల నాయకులతో కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, సుదర్శన్, మధుసూదన్రావు, రామలింగారెడ్డి, ఉమ, రాజనరసింగరావు, కృష్ణారావు, స్వర్ణలత తదితరులున్నారు.