హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్కు ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం ఇండస్ట్రియల్ పార్క్లో అజయ్దేవగణ్ ఆరునెలల కిందట గ్రీన్చాలెంజ్లో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ‘అజయ్ ఎన్వై ఫౌండేషన్’ను స్థాపించారు. అజయ్ నాటిన మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయని, పువ్వులు విరబూస్తున్నాయని ఎంపీ సంతోష్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అజయ్దేవగణ్కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు పెరిగి పువ్వులు విరబూసిన వీడియోను షేర్చేశారు.