హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హిమాయత్సాగర్ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటెయినర్ లారీ మరో గురువారం ఉదయం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కంటెయినర్ లారీకి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ సహా క్లీనర్ క్యాబిన్లోనే చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఔటర్ రింగ్రోడ్డు ప్రమాదం జరుగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలికి కంటెయినర్ రొయ్యల లోడ్తో వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. కేకలు విన్న అక్కడే ఉన్న వారంతా రక్షించే ప్రయత్నం చేశారు.
డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. అద్దాలు పగులగొట్టినా.. అప్పటికే మంటలు క్యాబిన్లోకి చేరుకున్నాయి. దీంతో మంటలు అంటుకొని మృతి చెందారని స్థానికులు, పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపశాఖ సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. మంటల్లో చిక్కుకొని మృతి చెందిన వారిని డ్రైవర్ సూరజ్, క్లీనర్ మృత్యుంజయగా పోలీసులు గుర్తించారు. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కంటెయినర్ ముందుభాగం బాగా దెబ్బతినడంతో పాటు మంటలకు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..