హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ను శుక్రవారం తిరుపతి పరిపాలనా భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి 21వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.