హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. పర్యావరణ హితం కోసం సీడ్ బాంబింగ్ కార్యక్రమాన్ని చిలుకూరు మృగవని పార్క్లో టీవీ9 ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు నటుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు, ఎన్జీవోలతో కలిసి తయారు చేయించిన 5లక్షల సీడ్బాల్స్ను పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ విసిరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్, మంత్రులు మాట్లాడుతూ పర్యావరణ రక్షణ అందరి కర్తవ్యమన్నారు.
ప్రస్తుతం 5లక్షల సీడ్బాల్స్తో జరుగుతున్న కార్యక్రమం.. భవిష్యత్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 50లక్షల సీడ్బాల్స్ విసిరేలా విస్తరిస్తామన్నారు. మనమంతా పచ్చగా ఉండాలంటే ప్రకృతిపచ్చగా ఉండాలని, దాని కోసం పిల్లల చేత సీడ్బాల్స్ చేయించడం గొప్ప కార్యక్రమమని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డీఎఫ్వోలు జోజి, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ పాల్గొన్నారు.