నారాయణపేట : కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సేవలు అభినందనీయమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ కు 200 లీటర్ల శానిటైజర్ను ఎంపీ పంపించారు. లాక్ డౌన్ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఎంపీ తెలిపారు. శానిటైజర్ అందజేసిన ఎంపీకి ఎస్పీ చేతన కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన ఎస్బీఐ..
ప్రస్తుత కరోన విపత్కర పరిస్థితిలో జిల్లా ప్రజలకు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను జిల్లా కలెక్టర్ డి. హరిచందన ప్రశంసించారు. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓ.పి.మిశ్రా రూ. 5 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను నారాయణపేట ప్రభుత్వ దవాఖానకు ఉచితంగా అందించారు.
విపత్కర పరిస్థితిలో మేము సైతం అంటూ ఎస్బీఐ ముందుకు వచ్చి తమ దాతృత్వం చాటుకోవడం హర్షణీయమన్నారు. వీటితో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు మరింత వెసులుబాటు లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి