నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రేపటి సీఎం కేసీఆర్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభాస్థలి తదితర ఏర్పాట్లను మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు.