మోత్కూరు: తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టు వస్ర్తాలు బహూకరించి సత్కరించారు. శ్రీకాంతచారి సోదరుడు రవీంద్రాచారి- శ్రావణి నూతన దంపతులకు పట్టు వస్ర్తాలను అందజేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం హైదరాబాద్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి వారి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్ధీన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్, శ్రీకాంతచారి తల్లిదండ్రులు శంకరమ్మ -వెంకటాచారి దంపతులు పాల్గొన్నారు.