హైదరాబాద్ : వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.