టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్
లాండసాంగిలో ప్రచారం
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 19 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటేయాలని టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని లాండసాంగిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తన తండ్రి ఆరె రాజన్న ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవలను కొనసాగించడానికి తనను జడ్పీటీసీగా గెలిపించాలని కోరారు. మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ డివిజన్ చైర్మన్ జిట్టా రమేశ్, తదితరులు పాల్గొన్నారు.