ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నలుగురు కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా నుస్పూర్ నుంచి ఆసిఫాబాద్కు మోటారు సైకిల్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రెబ్బన వద్ద వారి బైకును లారీ ఢీకొట్టింది. దీంతో తల్లీ కొడుకులు అక్కడికక్కడే మరణించారు. తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.