హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ‘ఇంట్ల ఉండుడు ఇక కుదరదు. బయట గాలి పీల్చుకోవాల్సిందే. చలో ఒక టూర్ పొయ్యొద్దాం’ అంటూ దేశంలో ఎక్కువమంది ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో ఈ ఏడాదే టూర్కు ప్లాన్ చేసుకుంటున్నామని 69 శాతం మంది చెప్పారు. 31 శాతం మంది వచ్చే ఏడాది చూద్దామని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకొని ప్రయాణిస్తామని 70 శాతం మంది చెప్పారు. ప్రయాణికులు ఏం అనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రముఖ ట్రావెల్స్ సంస్థలు థామస్కుక్ ఇండియా, ఎస్వోటీసీ ట్రావెల్స్ ఇటీవల సర్వే నిర్వహించాయి. ‘థర్డ్ హాలిడే రెడినెస్ రిపోర్ట్’ను విడుదలచేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు, పట్టణాలు దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మదురై, నాగ్పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, చండీగఢ్, మైసూర్, కోయంబత్తూర్, విశాఖపట్నం, పాట్నా నగరాల్లో వేలమందిని సర్వే చేశాయి.. సర్వే నివేదిక ప్రకారం..