సుల్తాన్బజార్, మే 25 : ఐసీఎంఆర్ సూచనల ప్రకారం దవాఖానలో అడ్మిట్ అయిన 14 రోజుల అనంతరం రోగులను డిశ్చార్జి చేసేలా చర్యలు తీసుకోవాలని కింగ్కోఠి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్నాథ్కు కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. మంగళవారం ఆమె దవాఖానను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అధికంగా ఉన్న రోగులను మినహాయించి మిగతా రోగులను వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 14 రోజులకే పూర్తిస్థాయి మందులు అందజేసి ఇంటికి పంపించాలన్నారు.