తిరుపతి : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం తరఫున మొరంశెట్టి రాములు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో మొరంశెట్టి రాములు చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసారు.
అనంతరం మొరంశెట్టి రాములు మీడియాతో మాట్లాడుతూ.. రెండో సారి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతంమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు నా చర్మంతో చొప్పులు కుట్టించినా తక్కువేనని, పాలక మండలిలో చోటు కల్పించిన ఇరురాష్ట్రాల సీఎంలకు మనస్సు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు శ్రీవారి ఆశీస్సుకు ఉండాలి ప్రార్థించినట్లు రాములు తెలిపారు.
మాతృశ్రీ వకుళామాత దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పెంపు విషయం ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పాలక మండలి సభ్యులను పెంచడం మంచి పరిణామమేని మొరంశెట్టి రాములు అన్నారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
లీడింగ్లో పుతిన్ పార్టీ.. కొన్ని చోట్ల కమ్యూనిస్టుల హవా