హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): లెర్నింగ్ మేనేజ్మెంట్ విధానంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన మూడ్లీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సంస్థ.. హైదరాబాద్కు చెందిన ఈ-అభ్యాస్ ఇన్ఫో సొల్యూషన్ ఎడ్టెక్ స్టార్టప్ను కొనుగోలు చేసింది. వంద మిలియన్ల అభ్యాసకులను కలిగి ఉన్న మూడ్లీ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నది. ఈ-అభ్యాస్ కొనుగోలు ద్వారా భారత్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మూడ్లీ ఫౌండర్ అండ్ సీఈవో మార్టిన్ డౌజియమస్ మాట్లాడుతూ.. మూడ్లీ లెర్నింగ్ మేనేజ్మెంట్ విధానాన్ని విస్తరించడానికి భారతదేశం ప్రత్యేకమైనదిగా గుర్తించినట్టు తెలిపారు.
దేశంలోని చాలా సంస్థలు మూడ్లీకి అనుబంధంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ-అభ్యాస్ను కొనుగోలు నేపథ్యంలో హైదరాబాద్ నుంచే దేశంలో ఆన్లైన్ అభ్యాసం, శిక్షణ పద్ధతులను విస్తరించడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. ఈ-అభ్యాస్ బృందం గత 12 సంవత్సరాలుగా విద్యా సంస్థలు, కార్పొరేట్లకు లెర్నింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నదని వెల్లడించారు. మాడల్ ఎల్ఎంఎస్ సేవలను విస్తరించడానికి మూడ్లీకి అవకాశం వచ్చిందని ఈ-అభ్యాస్ సీఈవో, వ్యవస్థాపకుడు సుశీల్కారంపురి తెలిపారు.
మంత్రి కేటీఆర్ అభినందన
ఈ-అభ్యాస్ను కొనుగోలు చేసిన మూడ్లీ సంస్థ సీఈవోకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో సమగ్ర ఈ-లర్నింగ్ సేవలు అందించడానికి మూడ్లీకి మంచి అవకాశం లభించిందని అన్నారు.