ఎవరు మీలో కోటీశ్వరులు.. ఇప్పుడు ఈ షో గురించి మిగిలిన వాళ్లేమో కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఈయన్ని వెండితెరపై చూడక మూడేళ్లు దాటిపోయింది. 2018లో అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్.. ఇప్పటి వరకు మరోసారి కనిపించలేదు. అందుకే కనీసం టీవీలో అయినా జూనియర్ను చూద్దామని వాళ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నానాటికి ఈ షో మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఇన్నాళ్లకు ఎవరు మీలో కోటీశ్వరులు మొదలవుతుంది.
తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో జూలై 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టారు నిర్వాహకులు.
దాదాపు ఐదేళ్ల తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ కరోనా కారణంగా చివరి నిమిషంలో ఈ షో మరింత ఆలస్యమైంది. తారక్ కు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేశాడు. ఆ షో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నేళ్లకు మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ వచ్చేస్తున్నాడు తారక్. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ ఈ ప్రోమోను తెరకెక్కించడం విశేషం.
జెమినీ ఛానెల్లో జూలై చివరి వారం నుంచి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టనున్నారు. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేశాడు జూనియర్. ఇక ఈ సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 13 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు ఎపిసోడ్కు రూ.50 లక్షల కంటే పైగానే అందుకుంటున్నాడు తారక్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమ్మతో వంట, ఆంటీతో కుట్లు, అల్లికలు నేర్చుకున్నా: కాజల్
ఆ రెండు కోరికలు తీరకుండానే మరణించిన కత్తి మహేశ్
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
కత్తి మహేష్ది ప్రేమ వివాహం అనే సంగతి తెలుసా