న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను దవాఖానలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు ప్రకటించింది.
ముంబై సమీపంలోని కాలామ్బాలి, బోయిసర్ రైల్వేస్టేషన్ల నుంచి ఖాళీ ట్యాంకర్లతో కూడిన రైలు విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారాల నుంచి ఆక్సిజన్ నింపుకొని ఆయా మార్గాల్లోని రాష్ట్రాల దవాఖానలకు చేరవేస్తుంది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల అభ్యర్థనపై స్పందించిన రైల్వేశాఖ ఆగమేఘాలపై కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కించి, దించేందుకు ఎక్కడిక్కడ ర్యాంప్లు ఏర్పాటు చేయాలని వివిధ జోన్ల రైల్వే అధికారులకు సూచనలు అందాయి. ఇప్పటికే పలు చోట్ల ర్యాంప్ల నిర్మాణం కూడా చేపట్టారు.
రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి ఆయా రైల్వే స్టేషన్ల పరిధిలో ర్యాంప్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. రైలు మార్గం ద్వారా వచ్చిన ట్యాంకర్లు రోడ్లపై వెళ్లేటప్పుడు అవాంతరాలు ఎదురవ్వకుండా ఎత్తు, వెడల్పు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..