అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 11: సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ముందంజలో నిలిచిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కృషి చేద్దామని అన్నారు. నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి సాధించేలా కృషి చేద్దామని అన్నారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం: మెచ్చా
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని అన్నారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ సున్నం లలిత, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.