హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/మైలార్దేవ్పల్లి: రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొబైల్ వెటర్నరీ క్లినిక్ల పని తీరు బాగున్నదని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాల ప్రశంసించారు. వీటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఉన్న గగన్పహాడ్ సత్యం శివం సుందరం గోశాలను ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మూగజీవాల చికిత్స కోసం వాడుతున్న మొబైల్ వెటర్నరీ క్లినిక్ల పనితీరును కేంద్రమంత్రికి రంజిత్రెడ్డి వివరించారు. అనంతరం మొబైల్ వెటర్నరీ సేవలను ప్రశంసిస్తూ రూపాల ట్వీట్ చేశారు.