హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించనున్నారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. వాణీదేవి మొత్తం 1,89,339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్రావుపై ఆమె గెలుపొందారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి.