మెల్బోర్న్: తమ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి పంపిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడ్డాక ఆసీస్ బృందాన్ని మాల్దీవులకు పంపిన భారత బోర్డు.. విమాన రాకపోకలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం ఎత్తేసిన వెంటనే ఆదివారం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపింది. దీనిపై సీఏ తాత్కాలిక సీఈవో నిక్ హ్యాక్లీ సోమవారం బీసీసీఐని అభినందించాడు.