దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ఈ క్రమంలో కోవిడ్పై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ తమిళ నాడు సీఎం రిలీజ్ ఫండ్కు రూ. లక్ష విరాళం అందించారు. అంతేకాదు దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ పడక(బెడ్)ల సమాచారాన్ని ‘ఫైండ్ ఏ బెడ్’ పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్గా నిధి ప్రచార సాయం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
కాగా తమిళ నాట ఇప్పటి వరకు సూర్య , కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు , దర్శకుడు వెట్రిమారన్ ,రూ.10 లక్షలు, ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్ రూ. 10 లక్షల రూపాయలు అందించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసి రూ.50 లక్షల రూపాయలు విరాళం అందించగా, హీరో విక్రమ్ తమిళనాడు రిలీఫ్ ఫండ్కు 30 లక్షల రూపాయలను ఆన్లైన్ ట్రాన్సఫర్ చేశారు.