నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి తక్షణమే ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం సజావుగా సాగుతున్నది. జక్రాన్పల్లి పీహెచ్సీలో గురువారం 44 పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. 43 మందికి కరోనా టీకాలు ఇచ్చామని పేర్కొన్నారు. ధర్పల్లిలోని ప్రభుత్వ దవాఖానలో 41 మందికి కొవిడ్ టీకా ఇచ్చినట్లు మండల ప్రధాన వైద్యాధికారి రఘువీర్గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఇందులో ధర్పల్లికి చెందిన వారు ఐదుగురు, హొన్నాజిపేట్ చెందిన వారు ఇద్దరు, సీతాయిపేట్, కామారెడ్డికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారని తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 30 మందికి వ్యాక్సిన్ వేసినట్లు సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 43 మందికి టెస్టులు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. కోటగిరి దవాఖానలో 40 మందికి టెస్టు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు. మోస్రా పీహెచ్సీలో 41 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. వర్నిలోని కమ్యూనిటీ వైద్యశాలలో 51మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 21మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 97 మందికి పరీక్షలు నిర్వహించగా 21మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 27 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెల్లడించారు. పాన్గల్లీ పీహెచ్సీలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా తేలిందని వైద్య సిబ్బంది తెలిపారు.
ఎడపల్లి పీహెచ్సీలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు దవాఖాన సిబ్బంది తెలిపింది. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో 53మందికి వ్యాక్సిన్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు. రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 23 మందికి వ్యాక్సిన్ వేసినట్లు సదరు దవాఖాన వైద్యాధికారి ఆయేషా సిద్దిఖీ తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద 52 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. బోధన్ మండలంలో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని సాలూర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. ఆర్మూర్లో 25 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ పీహెచ్సీల్లో నిర్వహించిన టెస్టుల్లో 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. వేల్పూర్ మండలంలో 11 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి అశోక్ తెలిపా రు. భీమ్గల్ పీహెచ్సీలో 64 మందికి పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్ వచ్చినట్లు, 76 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో గురువారం 33 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 59 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ రవికుమార్ తెలిపారు. చౌట్పల్లి పీహెచ్సీలో 55 మందికి టెస్టులు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 22 మందికి వ్యాక్సిన్ వేశామని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు.