నిజామాబాద్ : నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో పాలు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం విషయంపై ఆలయ పూజారులు, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించామని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు తామే తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కొండూరు గ్రామాభివృద్ధి కోసం రూ. 110 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పిల్లలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.