నిజామాబాద్ : ఎమ్మెల్సీ కవిత సామాజిక సేవ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఏర్పాటైన ‘కేసీఆర్ బువ్వ కుండ’ కార్యక్రమాన్ని జిల్లా సెంట్రల్ లైబ్రరీలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుతో కలిసి శ్రీధర్ పునః ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సకాలంలో భోజన వసతిని కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లడుతూ..గత ముడేళ్లుగా అభాగ్యుల ఆకలి తీరుస్తూ కవిత తన పెద్ద మనసును చాటుకుంటున్నారన్నారని ప్రశంసించారు. దేశ చరిత్రతో ఎక్కడా లేనివిధంగా లక్షలాది మంది కడుపు నింపుతున్న చరిత్ర ఎమ్మెల్సీ కవితదని అభినందించారు. కరోనా, అకాల వర్షాల సమయంలో ఆమె అందించిన సేవలను గుర్తు చేశారు.
అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదన్నారు. అందుకే పెద్ద మనసుతో ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అధికారం, పదవులతో సంబంధంలేకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అదర్శంగా నిలుస్తున్నరని తెలిపారు. గతంలో ఎక్కడ ఏ గ్రంథాలయంలో పట్టెడన్నం ఎవరు పెట్టలేదన్నారు. సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారు.
కానీ సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో కుడా ఎనలేని సేవలందించిన కవితపై కొంతమంది అనుచితంగా మాట్లడటం బాధాకరం అన్నారు. అలాంటివాళ్లకు ప్రజలే బుద్ధిచెప్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?