వనపర్తి : కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. మృతులను కడప జిల్లా పులివెందులకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి వీరు కారులో పులివెందుల వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు ముందుభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో పూర్తిగా నుజ్జునజ్జయ్యింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తకోట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.