తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని.. మళ్లీ సాధారణ పరిస్థితుల్లో ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు నిజామాబాద్లోని రామాలయంలో నిర్వహించిన జమ్మిపూజలో ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పాల్గొన్నారు.