ఖైరతాబాద్, జూన్ 4: కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొని, మానవ జాతిని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు అన్నార్తులకు అండగా నిలువాలని కోరారు. శుక్రవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొవిడ్ సమయంలో ప్రజలకు విశేష సేవలందించిన హర్యానా నాగరిక్ సంఘ్ సభ్యులను గవర్నర్ జ్ఞాపికలను అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమన్నారు. హర్యానా నాగరిక్ సంఘ్ ప్రతినిధి అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు ఉచితంగా అందించామమన్నారు. తమ సేవలను గవర్నర్ అభినందించడం సంతోషక రమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు పురుషోత్తం అగర్వాల్, సుశీల్ కుమార్, సురేశ్, ధీరజ్, ప్రకాశ్ గోయల్, అజయ్ పాల్గొన్నారు.