అంబర్పేట / గోల్నాక, జూలై 7 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం బాగ్అంబర్పేట డివిజన్లోని సీఈ కాలనీ పార్కులో హరితహారంలో భాగంగా కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి పార్కు, ఖాళీ ప్రదేశాలలో విరివిగా మొక్కలను నాటడం జరుగుతున్నదని చెప్పారు. నాటిన వాటిని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పట్టణ ప్రగతిలో రెడ్బిల్డింగ్, సోమసుందర్నగర్, శ్రీనివాసనగర్, సీఈ కాలనీ ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా కాలనీల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్, ఏఈ సౌమ్య, సూపర్వైజర్ శ్రీధర్, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణరాజు, కార్యదర్శి పి.వెంకటరావు, సత్యనారాయణరాజు, శ్యాంసుందర్రావు, కలీం, నాయకులు శ్రీరాములుముదిరాజ్, సుధాకర్, శివాజీయాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గోల్నాక : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట డివిజన్లోని అలీకేఫ్ దుర్గానరగ్లో స్థానిక కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్తో పాటు పలుశాఖల అధికారులతో కలసి నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బస్తీల్లో పర్యటించి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వెలగని వీధి దీపాల సమస్యలను పరిష్కరించడంతో పాటు బస్తీల్లో రహదారులను అతి త్వరలోనే అభివృద్ధి చేస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు. విద్యుత్, పారిశుధ్యం, విద్య, వైద్యం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, మల్లేశ్యాదవ్, రామారావు, సలీం, దుర్గయ్య, దయాకర్, రాజగోపాలనాయుడు, రంగు సతీశ్, చెలం, మహేశ్ముదిరాజ్, సంతోష్, విష్ణు, శ్రీనివాస్గుప్త, రాజు వంజరి, యూసుఫ్బాబా, జమీల్, సంతోష్, భవాని తదితరులు పాల్గొన్నారు.