మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మలయాళ సూపర్ హిట్ చిత్రం దృశ్యం 2. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రతి ఒక్కరిని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. దీంతో ఈ చిత్రాన్ని వెంటనే తెలుగులోను రీమేక్ చేశారు వెంకటేష్. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా, మూవీని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తుండగా కరోనా వలన వాయిదా పడింది.
ఆ మధ్య దృశ్యం 2 చిత్రం ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో సురేష్ బాబు ఖండించారు. అయితే ప్రస్తుతం వెంటకేష్ నటించిన ఎఫ్ 3, నారప్ప , దృశ్యం 2 చిత్రాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వలన రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్న మేకర్స్ ఓటీటీ ద్వారా ‘దృశ్యం 2’ సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత ‘నారప్ప’ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు.