హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఆఫీసర్గా ఉద్యోగం కల్పించింది. ఈరోజు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఎంతో కష్టపడి బాక్సింగ్లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్ యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంతేకాదు నిక్కత్ జరీన్ ను క్రీడలవైపు ప్రోత్సాహించిన తల్లిదండ్రులు పర్వీన్, జమీల్ లను సైతం ఎమ్మెల్సీ ప్రశంసించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా