నిజామాబాద్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కలిసి మెట్టినింట్లో ఏర్పాటు చేసిన వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
విజయాలను చేకూర్చే విజయదశమి ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.