నిజామాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ నగరం జలమయమైంది. కూడు, గూగు లేక ముంపు బాధితులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత వాసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూత నిచ్చారు. నగరంలోని గంగస్థాన్ పేస్ -2 ప్రాంతంలో గల వాగు పరివాహక ప్రాంతవాసుల ఆకలి తీర్చారు.
గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షలవల్ల ఇళ్లకే పరిమితమైన పలువురు నిరుపేదలకు రెండో రోజు కూడా భోజన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు జాగృతి, టీఆర్ఎస్ శ్రేణులు బాధితులకు ఆహారాన్ని అందించారు. ఆపద వచ్చినపుడల్లా ప్రజలకు అండగాఉంటుంన్నందుకు ఎమ్మెల్సీ కవితకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మహేందర్, టీఆర్ఎస్ నాయకులు హన్మగౌడ్, మచల్ పవన్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద