న్యూఢిల్లీ, మే 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం కుప్పకూలింది. దీంతో పైలట్, స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. ఈ దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పరిధిలో గల లాంగియానా ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. శిక్షణలో భాగంగా అభినవ్ విమానం నడుపుతుండగా అది అదుపు తప్పి కూలిపోయింది. విమానం కూలడానికి ముందు పైలట్ ప్యారచూట్ సాయంతో దిగడానికి ప్రయత్నించాడని, ఈ క్రమంలో ఆయన మెడ విరిగి మరణించినట్లు తెలుస్తున్నదని అధికారులు తెలిపారు. ప్రమాదస్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో అభినవ్ మృతదేహాన్ని గుర్తించామన్నారు.