హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇందులో భాగంగా అతి తక్కువ ఓట్లు వచ్చిన 30 మందిని ఎలిమినేషన్ చేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థికి వాణీ దేవికి 113 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 97 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు 67 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 48 ఓట్లు జమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి బీజేపీ అభ్యర్థి రాంచంద్రావుపై 8,037 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,802 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 1,04, 765 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 53,677 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,602 ఓట్లు వచ్చాయి. విజయానికి 1,68,520 ఓట్లు అవసరం ఉంది.