వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ పాముల మౌనిక (21)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారు. పురిటి నొప్పులు రావడంతో మౌనికను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకడంతో ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆక్సిజన్ లెవల్ పడిపోవడంతో మౌనిక ఆసుపత్రిలో చనిపోయింది. శిశువు ప్రాణాలతో బయటపడింది. మౌనిక మృతదేహానికి కుటుంబ సభ్యులు గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించారు.