సూర్యాపేట : కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతన్న జర్నలిస్టులకు తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ ఆర్థిక చేయూతనిచ్చారు. నియోజకవర్గంలోని నాగారం మండల కేంద్రానికి చెందిన అందె జానీ (ఆంధ్రప్రభ), సోమశేఖర్ (దిశ ), తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు (ప్రజా వాయిస్), గిలకత్తుల వెంకన్న (కానుక విలేకరి) కరోనా వ్యాధి బారిన పడి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అధైర్యపడొద్దని, అండగా నేనున్నానంటూ ఎమ్మెల్యే వారిలో మనోధైర్యాన్ని నింపారు. విపత్కర సమయంలో అండగా ఉంటున్న ఎమ్మెల్యే కిశోర్ కుమార్కు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?