నల్లగొండ : అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నార్కట్ పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలపై ఆరా తీశారు. టెస్టులకోసం వచ్చిన భాదితులతో మాట్లాడారు. కరోనా వచ్చినా రాకపోయినా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మన మనోధైర్యమే ఎంతటి రోగాన్నైనా తగ్గిస్తుందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. నార్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. వాక్సినేషన్ ప్రక్రియ మొత్తం కూడా స్థానికంగా ఉన్న హై స్కూల్ లో జరిగేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.