వరంగల్ : గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని ‘డి ఫ్లోరైడ్ ప్రాజెక్ట్’ లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అధికారులతో కలిసి పరిశీలించారు.
మరమ్మతు పనుల నిమిత్తం ఎమ్మెల్యే రూ. 50 వేల నగదును స్థానిక ఎంపీపీకి ఆర్థిక సహాయంగా అందచేశారు. వెంటనే యంత్రాలను ఏర్పాటుచేసి వరద నీటిని మళ్లించడానికి మరమ్మతు పనులను చేపట్టి ప్రమాదం నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఓడీసీఎంఎస్ చైర్మన్, నర్సంపేట ఆర్డీవో, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.