హైదరాబాద్ : ఎమ్మెల్యేగా గెలుపు పత్రాన్ని నోముల భగత్ అందుకున్నారు. నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపును ఆదివారం(మే 2న) చేపట్టి ఫలితాలను ప్రకటించారు. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ఏకంగా డిపాజిట్నే కోల్పోయారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అనంతరం ఎమ్మెల్యేగా గెలుపు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోముల భగత్కు అందజేశారు.