జగిత్యాల: సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కొండగట్టు ఆంజనేయునికి మొక్కులు చెల్లించుకున్నారు. గత నెల 20 సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని కొండగట్టు ఆంజనేయుని సన్నిదానంలో ఎమ్మెల్యే ముడుపు కట్టారు. అయితే సీఎం కరోనాను జయించడంతో.. ఆదివారం ఉదయం మెట్లదారి గుండా కాలినడకన కొండపైకి చేరుకున్న ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముడుపు విప్పి స్వామివారి మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట కొడిమ్యాల మండల నాయకులు కూడా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి