ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి నిధులతో ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుటుంన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. తొలుత ఓల్డ్ హౌజింగ్ బోర్డులో రూ.20 లక్షలతో చేపట్టే వరద నీటి కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
త్వరతగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను సూచించారు. శాంతినగర్ లో పట్టణ ప్రగతి నిధులు రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడి నుంచి లీనానగర్ లో పట్టణ ప్రగతి నిధులు వరదనీటి కాలువనిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలతో పాటు జాగ్రత్తలను పాటించాలని కోరారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ