తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందిచగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరు భారీ మెజారిటీతో గెలుపొందాలని భగవంతుడిని ప్రార్ధించానని చెప్పారు.