Telangana
- Dec 02, 2020 , 22:33:29
రేపు ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను గురువారం స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేతంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
సీఎం షెడ్యూల్ ఇలా..
10 గంటల 50 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరి 10 గంటల 55 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
11 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 11 గంటల 25 నిమిషాలకు పాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలు ముగిసే వరకు ఉంటారు.
12 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 12 గంటల 30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
తాజావార్తలు
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్క్రీమ్లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
MOST READ
TRENDING