నల్లగొండ : హామీ మేరకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటికీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దోస్త్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీ అకాడమిక్ ఇయర్కి సంబంధించి సంబంధిత అధికారులతో నాగార్జునసాగర్ నియోజకర్గ ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత జూనియర్ కాలేజీ భవనాన్ని పరిశీలించారు.
అంతకుక్రితం హాలియా మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్లో జరిగిన పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ మూడో వార్డు దళితవాడలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. వార్డ్లో కరెంటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, తదితర సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. దోస్త్ యాప్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య వివరాలిలా ఉన్నాయి. బీఏ తెలుగు మీడియం-60 సీట్లు, ఇంగ్లీష్ మీడియం-60 సీట్లు.. బీకాం ఇంగ్లీష్ మీడియం 60 సీట్లు, బీఎస్సీ(లైఫ్ సైన్స్) ఇంగ్లీష్ మీడియం 60 సీట్లు, బీఎస్సీ(ఫిజికల్ సైన్స్) ఇంగ్లీష్ మీడియం 60 సీట్లు కలవు.